గర్భిణిని తుపాకీతో కాల్చేసిన భర్త.. పొదల్లో దాక్కున్న కొడుకు బయటికొచ్చి..

మద్యానికి బానిసైన భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. గర్భిణి అయిన భార్యను దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కిరాతకంగా హత్య చేశాడు. కళ్లెదటే కన్నతల్లిని చంపేయడంతో నాలుగేళ్ల కొడుకు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి పోలీసులను ఎదుట జరిగిన విషయమంతా వివరించడంతో తండ్రిని కటకటాలవెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన యూపీలోని జాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సర్పతన్ పరిధి భటోలి గ్రామానికి చెందిన దీపక్ సింగ్, నేహ(25) దంపతులు ఉపాధి రీత్యా ఢిల్లీలో నివాసం ఉండేవారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామం భటోలి వచ్చారు. సుమారు 40 రోజుల లాక్‌డౌన్ అనంతరం యూపీ ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడంతో వైన్ షాపులు తెరుచుకున్నాయి. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లలో కొన్ని నిబంధలతో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Also Read:

వైన్ షాపులు తెరవడంతో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని దీపక్ సింగ్ భార్య నేహని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యానికి బానిసైన దీపక్ డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టాడు. భార్య ససేమిరా అనడంతో నాటుతుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. నాలుగేళ్ల కొడుకు ముందే భార్య తలపై గురిపెట్టి కాల్చడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కళ్లెదుటే తల్లిపై కాల్పులు జరపడంతో భయపడిపోయిన బాలుడు అక్కడి నుంచి పారిపోయి దూరంగా ఉన్న పొదల్లో దాక్కున్నాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న నేహని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పుల అనంతరం దీపక్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

పొదల్లోనే దాక్కున్న బాలుడు నాలుగు గంటల తరువాత బయటికి రావడంతో పోలీసులు అతని నుంచి నెమ్మదిగా వివరాలు సేకరించారు. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని నాన్నే అమ్మని చంపేశాడని చెప్పడంతో పోలీసులు దీపక్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతనిని అదుపులోకి తీసుకుని హత్యానేరం కింద అరెస్టు చేసి జైలుకి పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here