కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: హైదరాబాద్‌లో తగ్గిన కంటెయిన్‌మెంట్ జోన్‌లు

⍟ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ రెండు దశలు ముగియగా.. మూడో దశ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. రెండు విడతల్లో 40 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించగా.. మూడో దశలో కేంద్రం మరిన్ని మినహాయింపులను ఇచ్చింది. మార్చి 25న లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చేనాటికి 606 పాజిటివ్ కేసులు ఉండగా.. రెండో దశ లాక్‌డౌన్‌ ముగిసే నాటికి 42,000 దాటింది.

⍟ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 2,700మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,500వేలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83 మంది కరోనాకు బలయ్యారు. ఒక్కరోజులో ఇంత గరిష్ఠ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసుల్లో ముందున్న రికార్డులను ఆదివారం బ్రేక్ చేసింది.

⍟ లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన కేంద్రం.. ఇందుకు శ్రామిక్ స్పెషల్స్ పేరుతో రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞ‌ప్తి మేరకు ప్రత్యేక రైళ్లకు పచ్చ జెండా ఊపిన కేంద్రం.. వలస కార్మికుల తరలింపు బాధ్యతలను ఆయా రాష్ట్రాలకే అప్పగించింది.

⍟ ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 246 క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించింది. వరుసగా 28 రోజులు పాటు ఎలాంటి కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు నమోదు కాకపోతే అక్కడ గ్రీన్ జోన్‌గా నిర్ధారిస్తారు.

⍟ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేలు దాటగా.. వాటిలో మూడింట రెండొంతుల కేసులు కేవలం 13 ప్రాంతాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయానికి దేశంలోని 35 అతిపెద్ద పట్టణ ప్రాంతాల్లోనే 28,761 కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 72 శాతం.

⍟ ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

⍟ వనస్థలిపురం పరిధిలో కరోనా మహమ్మారి కేసులు గత కొన్ని రోజులుగా ఎక్కువగా నమోదవుతున్న వేళ ప్రభుత్వం అక్కడ కఠిన నిబంధనలకు సిద్ధమైంది. వనస్థలిపురంలో మొత్తం 8 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు గుర్తించారు.

⍟ మే నెలలోకి అడుగుపెట్టామో లేదో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారంలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రామగుండంలో 43.4 డిగ్రీలు నమోదు కాగా.. భద్రాద్రి జిల్లా జూలూరుపహడ్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

⍟ లాక్‌డౌన్ వేళ కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారితో పాటూ అత్యవసరంగా సొంత ఊర్లకు వెళ్లేవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే దీని కోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

⍟ కరోనా వైరస్‌ బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఇంటి వద్ద చికిత్స తీసుకున్నా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో తర్వాత ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు జాన్సన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు.

⍟ కరోనా వైరస్‌ ఇప్పట్లో మాయం కాదని.. దానితో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఆరోగ్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

లా క్‌డౌన్‌తో

పడుతున్న బాధలకు చలించి కేంద్ర ప్రభుత్వం వారి తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. ఇదే అదనుగా కొంత మంది స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేంద్రం దృష్టికి రావడంతో ఆదివారం (మే 3) మరిన్ని నిబంధనలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

⍟ లాక్‌డౌన్ వేళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్‌ ఆదేశాలతో రైతులు నష్టపోకుండా టమాటా నుంచి అరటి వరకూ అన్ని పంటలనూ ప్రభుత్వమే కొని, మార్కెటింగ్‌ చేస్తోందన్నారు మంత్రి కన్నబాబు.

⍟ కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా.. కేసులు ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతంలోకి ప్రజల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వ సిబ్బందే సమకూర్చుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 350 కంటెయిన్‌మెంట్లు ఏర్పాటు చేయగా 216 కంటెయిన్‌మెంట్లను ఎత్తేశారు. 134 కంటెయిన్‌మెంట్లు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here