ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ.. మహిళ నిద్రిస్తూ కనిపించడంతో..

ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ నిద్రిస్తున్న మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పరిధిలోని చకాన్‌ ప్రాంతంలోని ఓ జంట నివాసం ఉంటున్న ఇంట్లోకి తెల్లవారుజాము సమయంలో దొంగ చొరబడ్డాడు. కిటికీ నుంచి లోపలికి ప్రవేశించిన దొంగ సుమారు రూ.15 విలువైన సెల్‌ఫోన్‌తో పాటు రూ.5 వేల నగదు చోరీ చేశాడు.

అంతటితో ఆగని దొంగ కన్ను నిద్రిస్తున్న మహిళ(28)పై పడింది. నిద్రలో ఉన్న మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెకు మెలకువ వచ్చి లేచి చూసి పెద్దగా కేకలు వేసింది. భార్య కేకలు విన్న భర్త నిద్రలేచి దొంగని పట్టుకునే ప్రయత్నం చేశాడు. భార్యాభర్తలిద్దరినీ నెట్టేసి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని ఘటనతో మహిళ షాక్‌కి గురైంది.

Also Read:

మరుసటిరోజు ఉదయం భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. రూ.20 ఇరవై వేల విలువైన సొత్తు దొంగిలించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదు చేశారు. దొంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకుని బాధితురాలు వాపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here