ఆర్టీసీ బస్టాండ్ బాత్‌రూమ్‌లో మృతదేహం.. పలాసలో కలకలం

పలాస పట్టణంలో బుధవారం తీవ్ర కలకలం రేగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం కొందరు కలాసీలు టాయిలెట్‌కు వెళ్లగా గదిలో రక్తపు మరకలు, పక్కనే ఓ మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వేణుగోపాల్‌ అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రైవేటు కూలీలతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడిని కవిటికి చెందిన పి.శ్యాంబాబు అలియాస్ సాంబమూర్తి(40)గా గుర్తించారు. మృతదేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read:

కవిటికి చెందిన శ్యాంబాబు చాలారోజులుగా గుజరాత్‌లో ఉండి ఆరునెలల క్రితమే స్వస్థలానికి వచ్చాడు. కుటుంబసభ్యులను పట్టించుకోకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. మృతదేహం పడివున్న తీరు, అతడి శరీరంపై గాయాలు చూస్తే తీవ్ర పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న పాన్‌షాప్‌ తలుపులకు, కింది గచ్చుభాగానికి రక్తపు మరకలు అంటి ఉన్నాయి. అక్కడి నుంచి కాంప్లెక్స్‌లో బస్‌ పాసులిచ్చే కౌంటర్ వద్దకు ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

Also Read:

శ్యాంబాబు పురుషాంగంతో పాటు ఆపైభాగం, కింది భాగాల్లో తీవ్రమైన గాయాలున్నాయి. బస్టాండ్‌లోనే అతడికి అతి కిరాతకంగా చంపి బాత్‌రూమ్‌లో వేసినా ఎవరూ చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో దుండగులు పక్కా ప్లాన్‌తోనే అర్ధరాత్రి సమయంలో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం జరిగితే అన్ని విషయాలు బయట పడతాయని, ఆ తర్వాతే దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here