ఆన్ లైన్ కోచింగ్‌లో అశ్లీల చిత్రాలు… పుల్లెల గోపిచంద్ లాగౌట్

లాక్ డౌన్‌తో కొందరు ఆన్ లైన్ శిక్షణా తరగతుల్ని నిర్వహించుకుంటున్నారు. స్కూల్ కాలేజీలతో పాటు, అన్నిరకాల కోచింగ్ సెంటర్లు మూసివేయడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో విద్యార్థులకు రానున్న విద్యాసంవత్సరానికి కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కూడా ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్‌ నిర్వహిస్తోంది. దీంట్లో దేశ వ్యాప్తంగా 700 మందికి పైగా కోచ్‌లు పాల్గొని శ్రద్ధగా సూచనలు వింటున్నారు. వీరందరికీ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, ఇండోనేసియా కోచ్‌లు అగుస్‌ దివి సాంటోసో, నమ్రి సురోటో దిశ నిర్దేశం చేస్తున్నారు.

ఇలా ప్రముఖ కోచులు అంతా బిజీగా క్లాసులు వింటున్న వేళ ఒక్కసారిగా స్క్రీన్ పై ఏవో చెత్త బొమ్మలు రావడం మొదలయ్యాయి. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. కోచింగ్ ఇస్తూ అందరికీ షేర్ చేసిన స్క్రీన్ మీద అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్‌ సాంటోసో క్లాస్‌ చెబుతున్నారు. దీంతో అంతా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్‌లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న పుల్లెల గోపీచంద్‌ వెంటనే లాగౌట్‌ అయ్యాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సెషన్‌లో మహిళా కోచ్‌లు కూడా ఉన్నారని, ఇది చాలా ఇబ్బంది కలిగించిందని అందులో పాల్గొన్న ఓ కోచ్‌ తెలిపారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా 21 రోజుల పాటు బాయ్‌, సాయ్‌ ఈ ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాడొద్దని సూచించిన ‘జూమ్‌’ వీడియో కాల్‌ యాప్‌నే వీరూ ఆన్ లైన్ క్లాసుల కోసం వినియోగిస్తున్నారు. అయితే తమ ఆన్‌లైన్‌ సెషన్‌ హ్యాక్‌ కాలేదని ‘సాయ్‌’ పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని సాయ్‌, బెంగళూరు శాఖ తెలిపింది. దీనిపై సాయ్‌ ఐటీ డిపార్ట్‌మెంట్‌ విచారణ చేస్తోంది. ఇటీవల సింగపూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఆన్ లైన్ లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఎప్పటిలాగానే విద్యార్థులకు క్లాసులు ఇస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా తెరపై అసభ్యకరమైన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారంతా షాక్ కు గురయ్యారు. అవాక్కైన టీచర్లు వెంటనే క్లాసులను నిలిపివేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, అవసరమయితే..పోలీసు కేసు నమోదు చేస్తామని విద్యాశాఖ వెల్లడిస్తోంది. భద్రతా లోపాలను సవరించే వరకు ఉపాధ్యాయులెవరూ జూమ్ అప్లికేషన్ ను వాడొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here