లాక్డౌన్ సమయంలో వేరే ప్రాంతంలో చిక్కుకుని అతి కష్టమ్మీద ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై దుండగులు అత్యంత నిర్దయగా ప్రవర్తించారు. అతడిపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి బంగారం, నగదు దోచుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా పట్టణానికి చెందిన వాయల వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా బెంగళూరులో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
Also Read:
మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించిన తర్వాత బెంగళూరు నుంచి నెల్లూరు చేరుకున్నారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లడం సాధ్యపడలేదు. లాక్డౌన్-1, 2 సమయంలో నెల్లూరులోనే ఉండిపోయాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు మూడోసారి లాక్డౌన్ విధించడంతో ఇంటికి వెళ్లేందుకు శనివారం ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరారు. పాల వాహనంలో శనివారం రాత్రి ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అటుగా వెళ్తున్న బైకర్ను బ్రతిమాలి ఒంగోలు కొత్త నేషనల్ హైవే కొత్తపట్నం బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు.
Also Read:
రాత్రివేళ విజయవాడ వైపు వెళ్లే వాహనం వైపు ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు అతడిని అడ్డగించారు. ఇనుప రాడ్లు, కర్రలతో వెంకటేశ్వరరావును తీవ్రంగా కొట్టి అతడి వద్దనున్న రెండున్నర సవర్ల బంగారం, రూ.4వేల నగదు, సెల్ఫోన్, పర్సు లాక్కుని పరారయ్యారు. తీవ్రగాయాలతో బాధితుడు ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: