అప్పటివరకూ అన్ని విమానాలూ బంద్.. డీజీసీఏ ఉత్తర్వులు

భారత్‌లో లాక్ డౌన్‌ను మే 17 వరకూ పొడిగించిన వేళ విమానాలను కూడా ఆ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. పౌరవిమాయాన శాఖలోని డైరెక్టరెట్ జనరల్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం నిర్ణయం మేరకు మే 17 వరకూ దేశీయ (డొమెస్టిక్), అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) విమాన సేవల రద్దును పొడిగిస్తున్నట్లుగా డీజీసీఏ వెల్లడించింది. దీనికి సంబంధించి అన్ని జాతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థలు సహా, ఎయిర్ పోర్టులకు డీసీసీఏ ఉత్తర్వులను పంపింది.

మరోవైపు, కరోనా ప్రభావం పర్యటక రంగంపైనా పడింది. లాక్ డౌన్ ముగిసే వరకూ పర్యటక కార్యకలాపాలకు అనుమతి లేదని గోవా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 3 తర్వాత తమ రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గోవాలో కరోనా సోకిన రోగులంతా ఏప్రిల్ 17 నాటికి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.

మరోవైపు, దేశంలో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 37,336కు చేరుకుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీలోని 11 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరెంజ్, గ్రీన్‌ జోన్లకు ఉన్న మినహాయింపులకు ఈ 11 జిల్లాలు దూరం కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here