అనంతపురంలో ప్రేమోన్మాదం.. యువతి గొంతు కోసిన యువకుడు

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలం గుత్తి గ్రామంలో ఓ ప్రేమోన్మాది యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆమె గొంతు కోసేశాడు. గుత్తి గ్రామానికి చెందిన సుభద్ర అనే యువతిని రామాంజనేయులు అనే యువకుడు కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆమె అంగీకరించలేదు.

Also Read:

దీంతో సుభద్రపై కక్ష పెంచుకున్న రామాంజనేయులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంటికి సమీపంలోనే సుభద్రపై కత్తితో దాడిచేసి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న ఆమెను గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here