అతి తక్కువ సమయంలో.. కరోనాను జయించిన 9 నెలల పసికందు

దేశంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుల వయసున్న పసికందుల నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఈ మమహ్మారి బారిన పడుతున్నారు. కాగా ఉత్తరాఖండ్‌లో 9 నెలల వయసున్న ఓ శిశువు కరోనాను జయించాడు. ఆ బాబును ఏప్రిల్ 17న డూన్ హాస్పిటల్‌లో చేర్పించగా.. గురువారం డిశ్చార్జ్ చేశారు. అంటే ఆరు రోజుల్లోనే ఆ చిన్నారి కోవిడ్ నుంచి బయటపడ్డాడు. ఆ పసికందుకు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ చిన్నారికి తండ్రి నుంచి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ శిశువు తండ్రి తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చారు. కోవిడ్ సోకడంతో ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని డాక్టర్ ఎన్ఎస్ ఖాత్రి తెలిపారు. గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆయన కోవిడ్-19 నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగటివ్ వచ్చింది. కానీ ఈ చిన్నారి మాత్రమే కోవిడ్ బారిన పడ్డాడు. పాలు తాగే వయసు కావడంతో.. ఆ చిన్నారిని తల్లికి దూరంగా ఉంచడం సాధ్యపడలేదు. దీంతో ఆ చిన్నారితోపాటు అతడి తల్లి విషయంలోనూ డాక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆ చిన్నారిలో కోవిడ్ లక్షణాలు ఏ మాత్రం కనిపించలేదని.. నవ్వుతూ ఉన్నాడని చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఆ పసికందు కోసం మందులను ఎక్కువగా వాడలేదన్నారు. నెలల వయసున్న ఆ చిన్నారి కరోనా నుంచి కోలుకోవడంతో హాస్పిటల్ సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారికి ఎప్పుడు ఇన్ఫెక్షన్ సోకిందో స్పష్టంగా చెప్పలేమని, పసికందు వేగంగా రికవరీ కావడానికి అది కూడా కారణమై ఉంటుందని ఎయిమ్స్‌ నోడల్ ఆఫీసర్ రిషికేశ్ తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోనే ఓ ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి పది రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆయన చికిత్సకు వేగంగా స్పందించాడని డాక్టర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here