వాన్నాక్రై కంప్యూటర్లలో ప్రవేశించే తీరును ఐటీ నిపుణులు బట్టబయలు చేశారు. ఎలాఅంటే అర్థం కాని లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ఫార్మాట్లతో ప్రవేశించగానే కంప్యూటర్ లాక్ పడిపోతుంది. అది ఓ పెన్ కావాలంటే పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. డబ్బులు చెల్లించి కంప్యూటర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు.
ఎక్సెల్ కానీ, వర్డ్ ఫైల్, పీడీఎఫ్ ల రూపంలో మనకు మెయిల్ ఓ పెన్ చేస్తే వైరస్ కు చిక్కినట్లే నని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తెలియకుండా పైల్స్ ను ఓపెన్ చేయడంతో 150 ప్రపంచదేశాల్లో కోట్లలో నష్టపోవాల్సివస్తుంది. దీనిపై ప్రభావం ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, సాఫ్ట్ వేర్ , హాస్పటల్స్ పై తీవ్రప్రభావం చూపింది.
బ్రిటన్ తరహా కొన్ని దేశాల్లో బ్యాంకులు, ఆఫీసులు మూతపడ్డాయి. వైరస్ ను నాశనం చేసేందుకు మార్కస్ హచిన్స్ బగ్ ను కనిపెట్టాడు. ప్రపంచ దేశాల్ని పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలంటే మరో వారం పదిరోజుల సమయం పట్టొచ్చనేది అంచనా. బ్యాంక్ ట్రాన్స్ క్షన్లు చేయకపోవడం మంచిదని, అలా చేస్తే బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.