ముంబై ఎయిర్పోర్ట్ లో కోహ్లీ అనుష్క శర్మ లు కనపడ్డం తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మేడే రోజున అనుష్క పుట్టినరోజు కావడం తో అదే రోజు ముంబై – బెంగళూరు మ్యాచ్ ఉండడం తో వారిద్దరికీ కలవడం కుదరలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత ఒక షెడ్యూల్ లేకపోవడంతో వారిద్దరూ ఎక్కడికో వెళ్లారని తెలుస్తోంది. అనంతరం వస్తున్న సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో వారిద్దరూ అభిమానుల కంటబడ్డారు.
ఔటింగ్ కి విదేశం వెళ్లారు అనీ ఈ సారి దుబాయ్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ జంట వెంటనే తిరిగ వచ్చారు అనీ చెబుతున్నారు. గాయం కారణంగా మ్యాచ్ కి ఎగనామం పెట్టాడు విరాట్ కోహ్లీ షూటింగ్ గ్యాప్ లో ఆమె విరాట్ తో సమయం స్పెండ్ చేసింది .తమ అభిమాన జంటను సెల్ ఫోన్లలో బంధించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.