కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ పొడిగించినా.. వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ శుక్రవారం (మే 1) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇదే సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఏయే కార్యకలాపాలు కొనసాగుతాయో, వేటికి అనుమతి లేదో చూద్దాం..
అనుమతి కల్పించే అంశాలివే..
* అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. కంటెయిన్మెంట్ జోన్లలో సామాజిక దూరం తదితర నియమాలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి.
* రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే బస్సులు నడిపించాలని ఆదేశం.
* ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షల సడలింపు. వ్యక్తిగత వాహనాలకు అనుమతి. కార్లలో ఇద్దరు ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి.
* ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి.
* గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపారాలకు అనుమతి.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించాలి.
* రెడ్ జోన్లలో వారానికి ఒకసారి పరిస్థితి పరిశీలించి.. కేసులు తగ్గితే ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లో నిత్యావసరాలు, ఔషధ రంగం, వైద్య ఉపకరణలు, ఐటీ, హార్డ్వేర్, జ్యూట్ ఇండస్ట్రీ తదితరాలకు నిబంధనలతో అనుమతి.
* నిర్మాణ రంగంలో కొద్ది మంది కార్మికులతో, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు సాగించేలా అనుమతి.
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీ తదితరాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనుమతి.
Must Read:
వీటిపై నిషేధం కొనసాగింపు..
* విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం. ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర హోం శాఖ అనుమతితో ఈ సేవలకు అనుమతి.
* స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్.
* హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, జిమ్లు బంద్.
* స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు బంద్.
* ప్రజలు గుమిగూడటానికి ఆస్కారం ఉన్న అన్ని కార్యక్రమాలపై నిషేధం కొనసాగింపు. అన్ని రకాల ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు.
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు. అవసరమైన చోట్ల 144 సెక్షన్ విధింపు.
* అన్ని జోన్లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్బిణులకు అనుమతి నిరాకరణ. ప్రత్యేక అవసరాలకు మాత్రమే బయటకు రావడానికి అనుమతి.
* కంటెయిన్మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు.
* రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి లేదు.
Also Read: