సినిమా హాల్ లో టాయిలెట్ కి వెళ్లి తిరిగిరాని భార్య

ఓ జంట సరదాగా కాసేపు గడుపుదామని సినిమాకు వెళితే, వాష్ రూముకు వెళ్లిన భార్య తిరిగి రాని ఘటన నెల్లూరులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టీడీ గూడూరు మండలం వరిగొండ గ్రామంలో పోలంరెడ్డి అవినాష్ రెడ్డి, హరిత లక్ష్మి దంపతులు. వీరు 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 థియేటర్ లో సినిమాకు వచ్చారు.

సినిమా మధ్యలో హరిత వాష్ రూముకు వెళ్లి వస్తానని వెళ్లింది. ఆపై తిరిగి రాలేదు. ఆ చుట్టుపక్కలా గాలించి, బంధుమిత్రులను విచారించిన అవినాష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, హరిత ఏమైందన్న విషయాన్ని కనుగొంటామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here