అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విష పదార్థం ఇవ్వడం కలకలం రేపుతోంది. ట్రంప్కు విష పదార్థం పంపారని తెలియడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే దీన్ని ఇంకా అధికారులు దృవీకరించలేదు.
వైట్ హౌస్ చిరునామాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ పార్శిల్ వచ్చింది. దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. అయితే దీన్ని వౌట్ హౌస్ ఎంట్రీలోనే అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమ్తమైన అధికారులు రిసిన్ అనే విషపదార్థం ఇందులో ఉన్నట్లు భావిస్తున్నారు. రిసిన్ అనేది ఆముదం గింజల్లో ఉంటుంది. ఈ రిసిన్ తీసుకున్న వారు రెండు మూడు రోజుల్లోనే చనిపోతారు. అయితే దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు.
ట్రంప్ పేరుమీద వచ్చిన ఈ కవర్ పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫెడరల్ దర్యాప్తు సంస్థ, సీక్రెట్ సర్వీస్ , యూ ఎస్ పోస్టల్ ఇన్స్పెక్షన్ సర్వీస్లు దీనిపై విచారణ చేస్తున్నాయి. అయితే ట్రంప్కు ఇలా విషపదార్థం ఇవ్వాలని ఎవరు ప్లాన్ చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చని వారు ఎవరైనా ఈ చర్యలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ ఎలాంటి అధికారిక సమాచారము బయటకు ఇవ్వలేదు. మరిన్ని వివరాలు అధికారులు చెబితే కానీ తెలియదు.