ఇండియా లో ఉన్న టోల్స్ అన్నీ ఎత్తేస్తారా ? మోడీ షాకింగ్ నిర్ణయం త్వరలో ?

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అన్నా చివరికి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలి అన్నా కూడా టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు చెల్లించలేక జనం జేబులకి చిల్లులు పడుతున్నాయి. ఉదాహరణ కి చెన్నై లాంటి ప్రాంతం నుంచి కన్యా కుమారికి వెళ్ళాలి అంటే టోల్ వారికే పదిహేను వందలు కట్టాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం మీద ఎప్పటి నుంచో జనాలలో అసహనం ఉంది. ఇలా నిలువునా దోపిడీ చేస్తున్న టోల్ ప్లాజా లని పూర్తిగా మూసేస్తాం అని మోడీ పార్టీ తమ 2014 మ్యాని ఫేస్తో లో ఎప్పుడో పెట్టింది. ప్రస్తుతం దేశంలో 434 టోల్ ప్లాజాలు నడుస్తుండగా, కారుకో రేటు, లారీకో రేటు, బస్సుకో రేటు, పెద్ద వాహనాలకు మరో రేటు చొప్పున వసూలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ టోల్స్ తాము ఎందుకు కడుతున్నమో కూడా తెలీనంతగా డబ్బు ఖర్చు పెడుతున్నారు జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here