కొత్త సంవత్సరం రచ్చ .. మెట్రో బంపర్ ఆఫర్

కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలా? వద్దా? అనే చర్చలు జరుగుతుండగానే యువత మాత్రం వారి వారి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. న్యూ ఇయర్ జోష్‌లో ఊగిపోయేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా చూస్తున్నది ఎప్పుడు చీకటి పడుతుందనే! దీనికితోడు నేడు ఆదివారం కలిసి రావడంతో ఇప్పటి నుంచే సంబరాల కోసం ‘ఏర్పాట్లు’ చేసుకుంటున్నారు.

అర్ధ రాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో తన సేవలను  పొడిగించింది. నేటి అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. సాధారణ సమయాల్లో ఉదయం 5 నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నడిచే రైళ్ల సమయాన్ని ఆదివారం పొడిగించినట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here