కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చెయ్యాలని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి అన్నారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపడతామన్నారు. ప్లాస్మా దానం చేస్తున్న వారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో కలిసి ఆయన సత్కరించారు.
తన ఇంట్లో పనిచేసే నలుగురు వ్యక్తులు కరోనా వారిని పడ్డారని చిరంజీవి తెలిపారు. అయితే వారందరూ కోలుకుని ఇప్పుడు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్లాస్మాతోనే మనల్ని మనం కాపాడుకోవలన్నారు.
గతంలో తాను ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ప్రతి రోజు ఎంతో మంది అభిమానులు రక్తదానం చేస్తున్నారన్నారు. ఇటీవలే తన బ్లడ్ బ్యాంక్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నారు.