పరవాడ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంపై స్పందించిన కలెక్టర్

విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను పంపామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను కూడా తరలించామని చెప్పారు.

పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు దగ్గరకు వెళ్లలేకపోతున్నాయి. సమీపంలో అనేక కంపెనీలు ఉండటంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here