కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ వాడుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మాస్క్ ఎన్ని రోజులు ధరించాలన్న దానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రోనా కట్టడి కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని భారత వైద్య పరిశోధన మండలి చీప్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ స్పష్టం చేశారు. టీకా వచ్చినా సరే ప్రజలు సుదీర్ఘకాలం పాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. కొవిడ్ వ్యాధి నిర్వహణ-మార్పులు అనే అంశంపై కోల్కతాలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వెబినార్లో ఆయన పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
కరోనాను అంతం చేయాలంటే..టీకా ఒక్కటే సరిపోదు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను కొనసాగించాల్సి ఉంటుంది’ బలరామ్ భార్గవ స్పష్టం చేశారు. మాస్కులు అంటే దుస్తులతో చేసిన టీకా లాంటిదన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాటిలో రెండు భారత్లో తయారైతే.. మిగతా మూడు విదేశాలకు చెందినవని తెలిపారు. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి కరోనా టీకా వేయాలనేది లక్ష్యమన్నారు. ఆ తరువాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.