అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న విషయం తెలసిందే. అయితే నేడు అమరావతిలోనే మూడు రాజధానులు ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు ఉద్యమం చేస్తున్నారంటున్నారు.
అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజా మహిళా సంఘాల ఆద్వర్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజధాని నడిబొడ్డున మందడంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉందన్నారు. అందుకే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వై.ఎస్ జగన్ కోరుకుంటున్నారన్నారు. అందుకే చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా దేవుడి ఆశీస్సులు, ప్రజాబలం జగన్కే ఉంటాయన్నారు. పేద ప్రజల కోసం రాజధానిలో ఇళ్లు ఇవ్వడానికి జగన్ ముందుకొస్తే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారన్నారు. ఇక వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు.