ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాకచక్యమైన రాజకీయాలు చేస్తోంది. ఈ రాజకీయాలతో చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. చంద్రబాబు ఓ ప్లాన్ వేస్తే.. బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. దీంతో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని టిడిపి వర్గాల్లో అలజడి మొదలైంది.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు.. బీజేపీకి మద్దతివ్వాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీకి ఇంటర్నల్ సపోర్టు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ వంకతో బీజేపీకి దగ్గరవ్వడానికి అవకాశం దొరకుతుందని బాబు భావిస్తున్నారు. అయితే విషయం లీకవ్వడంతో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది.
బీజేపీకి చంద్రబాబు మద్దతు తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చర్చిస్తున్నారంట. అందుకే చంద్రబాబు మద్దతు కంటే ఆ పార్టీ నేతల్నే పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. అందుకే గత ఎన్నికల్లో తిరుపతి లోక్ సభకు టిడిపి నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు లోలోపల మాటలు ఎక్కువయ్యాయంట. పనబాక లక్ష్మి కూడా టిడిపి ఎలాగో పోటీ చేయడం లేదు కదా.. ఇక బీజేపీలోకి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టిడిపిలో ఉండలేక బయటికొస్తున్న నేతలతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు పనబాక లక్ష్మి కూడా తన దారి తాను చూసుకుంటే బాబుకు చెక్ పెట్టినట్లే అని అంతా అనుకుంటున్నారు. బాబు రాజకీయ ఎత్తుగడను చిత్తు చేసేలా బీజేపీ ఈ రాజకీయ ఎత్తుగడ వేస్తే మాత్రం చంద్రబాబు టీంకు దిమ్మతిరిగిపోతుందని రాజకీయ వర్గాలలో డిస్కషన్ నడుస్తోంది. మరి ఈ విషయంలో ఎలా జరుగుతుందో వేచి చూడాలి.