క‌రోనా సోకిన డొనాల్డ్ ట్రంప్‌ను ఎగ‌తాళి చేస్తోంది వీరే..

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌ల‌హాదారుల్లో ఒక‌రికి క‌రోనా సోక‌డంతో ట్రంప్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ట్రంప్ కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని అంతా అనుకుంటున్నారు.

అయితే ట్రంప్ క‌రోనా ప‌ట్ల ముందునుంచి వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల ఇప్పుడు అంద‌రూ స్పందిస్తున్నారు. క‌నీసం మాస్కు కూడా పెట్టుకోకుండా అప్ప‌ట్లో ప్ర‌వ‌ర్తించిన ట్రంప్‌కు చివ‌ర‌కు క‌రోనానే సోకింద‌ని డిస్క‌ష‌న్ మొద‌లెట్టారు. కాగా అమెరికాతో భార‌త్‌కు ఉన్న మంచి సంబంధాల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్రంప్ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అయితే ఆయ‌న‌పై వ్య‌తిరేకంగా చాలా దేశాల నుంచి స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ట్రంప్‌కు జ‌ర‌గాల్సిందే అన్న‌ట్లుగా ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌ధానంగా చైనా ట్రంప్‌కు క‌రోనా సోక‌డం ప‌ట్ల చైనా ప్ర‌జ‌లు వ్యంగాస్త్రాలు స్పందిస్తున్నారు. ఆ దేశ వార్తా ప‌త్రిక కూడా ట్రంప్ త‌గిన మూల్యం చెల్లించుకున్నారని పేర్కొంది. చైనా ప్ర‌జ‌లు ఈ రోజు నెట్లో వెతికిన దాంట్లో ప్ర‌త్యేకంగా ట్రంప్‌కి క‌రోనా సోక‌డం గురించే వెతికారు. వెత‌క‌డమే కాకుండా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇరాన్ వార్తా సంస్థలు కూడా ట్రంప్‌కు క‌రోనా సోక‌డంపై వ్యంగ్యంగా ప్ర‌సారం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here