చెన్నై ప‌ర్య‌ట‌న‌లో అమిత్‌షా.. ఫ్ల‌కార్డ్ విసిరిన ఓ వ్య‌క్తి..

అమిత్‌షా చెన్నై ప‌ర్య‌ట‌న‌పై రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఉన్నాయి. అయితే ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో ఓ వ్య‌క్తి అమిత్‌షా పై ఫ్ల‌కార్డు విసిరాడు. దీంతో ఒక్క‌సారిగా ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా సిబ్బంది షాక్‌కు గుర‌య్యారు.

అమిత్ షా రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తారు. 2021లో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలు జరపడంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. చెన్నై విమానాశ్ర‌యం చేరుకున్న ఆయ‌న అక్క‌డి నుంచి కాన్వాయ్‌లో వెళ్తూ, జీఎస్‌టీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న బీజేపీ, ఏఐఏడీఎంకే కార్యకర్తలకు అభివాదం చేసేందుకు కారు దిగి, నడుస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు ఆయనపైకి ఓ ప్లకార్డును విసిరాడు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్లకార్డు ఆయనపై పడకుండా నిరోధించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగంతకుడు విసిరిన ప్లకార్డుపై ‘గో బ్యాక్ అమిత్ షా’ అని రాసి ఉంది. ఈ వ్యక్తి చెన్నైకి చెందిన దురైరాజ్ (67) అని పోలీసులు తెలిపారు. కాగా చెన్నై విమానాశ్రయం బయట ఉన్న జీఎస్‌టీ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన కారు నుంచి దిగి, రోడ్డుపై నడిచారు. దీంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here