టెలివిజన్ ప్రకటనల విషయం లో చూపించేది ఒకటీ , చెప్పేది ఒకటీ , ఫలితం ఇచ్చేది ఒకటీ అన్నట్టుగా సాగుతోంది అంటూ జనం గొడవ చేస్తున్న నేపధ్యం లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇప్పుడు సంచలన ప్రకటన చేస్తోంది. దాదాపు 143 కంపెనీలు తమ ప్రకటనలని నిజం లేకుండా ఇస్తున్నాయి అనీ తమ దగ్గర ఉన్న 191 ఫిర్యాదులకి గాని 143 ఫిర్యాదులు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అని , నిజాయితీ లేనేలేదు అని ఆరోపించింది. భారతీ ఎయిర్ టెల్, ఆపిల్, కోకకోలా, థమ్స్ అప్, అమూల్, నివియా తదితర ఎన్నో కంపెనీలను తప్పుబట్టింది.
మొబీ క్విక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఒపెరా, పెర్నార్డ్ రికార్డ్ ఇవన్నీ కూడా ఈ లిస్టు లో ఉన్నాయి. ఆరోగ్య విభాగంలో 102, విద్యా విభాగంలో 20, పర్సనల్ కేర్ విభాగంలో 7 వరకూ ఫిర్యాదులు ఉన్నాయి. ఐఫోన్ సంస్థ 7 వేరియంట్ కోసం మాత్రమె తప్పుడు ఇమేజ్ చూపిస్తోంది అని ఈ సంస్థ ధృవీకరణ చేసింది. ఎయిర్టెల్ మీద అధికంగా మూడు ఫిర్యాదులు స్వీకరించింది అస్కా