మనం తినే ఆహారం లో బరువుతగ్గించేవి, బరువును పెంచే రెండు రకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి. అయితే బరువును పెంచే ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు అన్నం తిన్న తరువాత నడవాలని అంటుంటారు. వీటితో పాటు కొన్ని రకాల రసాల్ని తాగడం వల్ల పొట్ట తగ్గడం, అధిక బరువు, కొలస్ట్రాల్ ముప్పునుంచి ఉపశమనం పొందవచ్చు.
పాలు
సజ్జగింజలు
సగ్గుబియ్యం
తేనే, బెల్లం
బాదం పప్పులు
తయారు చేసే విధానం
మొదట సజ్జగింజల్ని నాన బెట్టాలి. పాలు, సగ్గుబియ్యం, కొంచెం యాలుకల్ని కలిపి ఉడికించాలి. పూర్తయిన తరువాత సగ్గుబియ్యంలో నానబెట్టిన సజ్జగింజల్ని కలపాలి. వీటితో పాటు తేనె, బెల్లం కలుపాలి. ఉదయాన్నే టిఫిన్ కు బదులు, మధ్యాహ్నం అన్నానికి బదులు ఈ రుచికరమైన చిరుధాన్యాన్ని ఆహారం తీసుకోవాలి. ఇది తినడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో ఉన్న కొవ్వును, ఆకలిని తగ్గిస్తుంది.