గంగానది ఎంత పరమపవిత్రమైందో అందరికి తెలిసిందే. గంగానదిలో స్నానం ఆచరిస్తే ప్రతీఇంట ఆనందం వెల్లివిరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భారతీయ హైదవ దర్మం ప్రకారం చనిపోయిన వారి అస్థికల్ని గంగానదిలో కలిపితే పుణ్యం చేకూరుతుందని చెప్పుకుంటారు. అందుకే ఎవరు స్వర్గస్తులైన గంగానది లో కలిపి స్నానం ఆచరిస్తారు. ఇలా కలపడం వల్ల కొన్ని కోట్ల టన్నుల చెత్త, మన్ను తయారవుతుంది. కానీ గంగా నీరు మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు పరిశోదనలు జరిపారు. ఈ పరిశోదనల్లో గంగమ్మే తనను తాను శుభ్రం చేసుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ నీటిలో మందు కనిపెట్టలేని సుక్ష్మజీవుల్ని నాశనం చేసే శక్తి ఆ నీటిలో ఉండే బ్యాకిట్రయోఫేజ్ కు చెందిన పలు వైరసులు పుష్కలంగా ఉన్నట్టు కనుగొన్నారు. వీటితో రోగాల్ని నయం చేసే శక్తి ఉందని పరిశోదనలు జరిపి వ్యాధులకు విరుగుడు కనిపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు.