ఆస్తి తగాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి పరారైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షదర మానస సరోవర్ పార్క్ సమీపంలో చోటు చేసుకుంది. ఆ మహిళలు ఉంటోన్న ఇంటికి సెక్యూరిటీ గార్డుగా ఉన్న రాకేశ్ను కూడా దుండగులు చంపేశారు. మృతులను ఉర్మిళ జిందాల్ (82), ఆమె కూతుళ్లు సంగీత గుప్తా (56), నుపుర్ (48), అంజలి (38)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సన్నిహితులమని చెప్పుకుని వారింట్లోకి ప్రవేశించి దుండగులు… ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.