క రోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో ప్రధాన రంగాలన్నీ కుదేలైన వేళ భారత .. దేశ వాసులకు శుభవార్త అందించారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. కరోనా మహమ్మారితో కుదేలైన రంగాలన్నింటికీ ఈ భారీ ప్యాకేజీ గొప్ప ఊరట కల్పించనుంది. దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఇది కొత్త ఊపిరి కల్పించే అవకాశం ఉంది. రెండు నెలలుగా స్తబ్ధత నెలకొన్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఊపందుకోనుంది. మంగళవారం (మే 12) సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.