ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు రాష్ట్రంలో రోజురోజుకీ ప్రజల నుండి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో తన పార్టీకి చెందిన ఎంపీలు దీక్ష చేయడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ వారితో వీడియో కాల్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ” మీరు చేస్తున్న ఆమరణ దీక్ష ఐదు కోట్ల మంది ఆంధ్రులు జీవితకాలం మరిచిపోరు.రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీ వైపె చూస్తుంది.మీరు మీ పదవులకు రాజీనామా చేసి ,ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని ” అన్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీలు స్పందిస్తూ..‘మాకు మా పదవులు.. ఆరోగ్యం కంటే ప్రజల తరపు పోరాటమే ముఖ్యం. మీరు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. గతంలో మీరు చేసిన దీక్షలే మాకు స్ఫూర్తి. హోదా సాధించే వరకు పోరాడతాం’అని తెలిపారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జగన్ .. జాగ్రత్తగా ఉండాలంటూ వారికి సూచనలు చేశారు. చిత్తశుద్ధితో మీరు చేస్తున్న పోరాటానికి భవిష్యత్తులో కచ్చితంగా ప్రజలు బొమ్మలు గుర్తు పెట్టుకుంటారు అని అన్నారు.