వచ్చే ఏడాది తో మెగా స్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం పూర్తి అవుతుంది. ఆయన మళ్ళీ తన సభ్యత్వం పోడిగించుకోవడం చెయ్యాలి కనీ అంతటి ఎమ్మెల్యే లు ఏపీ కాంగ్రెస్ దగ్గర లేనే లేరు. కావాలి అనుకుంటే ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి ఆ పని చెయ్యాలి. సో దానికి చిరు ఒప్పుకోరు , కాబట్టి కాంగ్రెస్ తరఫున ఆయన్ని నామినేటెడ్ ఎంపీగా పంపడం జరిగే పని కాదు. దీన్ని ఉపయోగించుకుని టీడీపీ , వైకాపా ఇప్పుడు చిరు ని తమవైపు లాక్కోవాలి అని చూస్తున్నారు. గంటా సహాయం తో ఇదంతా జరిగేలా టీడీపీ చూస్తూ ఉంటె వైకాపా మాత్రం చిరు సినిమా ప్యాషన్ అంత తమవైపు రావాలి అని కోరుకుంటోంది. జగన్ లండన్ నుంచి రాగానే చిరు ని ఆహ్వానించడం, వీలైతే పవన్ తో కూడ కలిసి పనిచేసే అవకాశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీ ని వేయనున్నట్టు తెలుస్తోంది.