నాగ్ ని డైరెక్ట్ చేయనున్న ‘యాత్ర’ దర్శకుడు..?

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వ పనితీరు ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇక ఈ సినిమా తర్వాత మహి ఇప్పటివరకు తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం మహి వి రాఘవ్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ కింగ్ నాగార్జున తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ యంగ్ దర్శకుడు… నాగార్జునకు స్క్రిప్ట్ లైన్ ను  వినిపించాడని… దానికి ఇంప్రెస్ అయిన నాగార్జున, పూర్తి కథను చెప్పమని కోరినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here