భర్త కోసం భార్య చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. తన భర్త చనిపోయాడని తెలిసి ఆమె కూడా తనువు చాలించాలని డిసైడ్ అయ్యింది. చివరకు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది.
ఖండేల్వాల్, సానియా సుమన్లు 15రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. సానియా ఎంబీబీఎస్ చదువుతోంది. అయితే ఈనెల 9వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగిన సానియా భర్త ఖండేల్వాల్ చనిపోయారు. దీంతో ఒంటరిగా ఉన్న సానియాను తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు ఉజ్జయినీకి వచ్చారు. సానియాను తీసుకొని ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
అయితే ఇంతలో ఏమైందో కానీ సానియా ఉన్నట్టుండి ఎయిర్పోర్టు సమీపంలోని షాపింగ్ మాల్ మూడో ఫ్లోర్కి వెళ్లి అక్కడి నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఇందులో తన భర్త లేకుండా తాను ఉండలేనని, అందుకే చనిపోతున్నట్లు రాసింది. తన భర్తతో కలిపి దహనసంస్కారాలు చేయాలని లేఖలో రాసింది. ఇది చదివిన వారంతా కన్నీరుమున్నీరయ్యారు. భర్త చనిపోయి నాలుగు రోజులు కాకముందే భార్య చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.