సూపర్స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఇంకా ఆందోళన నెలకొంది. అధిక రక్తపోటు కారణంగా ఈ నెల 25వ తేదీన ఆయన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.
రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని రకాల వైద్య పరీక్షలో రిపోర్డ్లు నార్మల్గా వచ్చాయన్నారు. రజనీ డిశ్చార్జ్పై ఆదివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్కు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. నిన్నటికంటే ఈరోజు రజినీ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. రజినీకాంత్ బీపీ కంట్రోల్లోనే ఉందన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు. ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని, బీపీ సమస్య తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.