యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమా వస్తోందంటే చాలు ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తుంటారు అభిమానులు. తాజాగా ఆయన ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్.
ఈ సినిమాలో ప్రభాస్తో పాటు సైఫ్ ఆలీఖాన్ కూడా నటిస్తున్నారు. రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమే. రావణుడిలో ఉన్న మానవీయ కోణాన్ని `ఆదిపురుష్`లో చూపించబోతున్నామని ఇటీవల సైఫ్ కామెంట్లు చేశారు. దీంతో ఈ కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో వెంటనే ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంకా వివాదం ముగిసిపోలేదు. ఉత్తరప్రదేశ్కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది తాజాగా జౌన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. సైఫ్ అలీఖాన్, దర్శకుడు ఓం రౌత్ పేర్లను తన పిటీషన్లో పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.