యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ వార్త వచ్చినా వైరల్గా మారుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వరకే ఆయన బిగ్బాస్ షోతో టీవీల్లో సందడి చేశారు. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ వస్తారని డిస్కషన్ నడుస్తోంది.
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ మొదటి సీజన్కు వ్యాఖ్యాతగా తారక్ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కోసం ఓ ప్రత్యేక టాక్ షోను నిర్వహించనున్నాడు. `కౌన్ బనేగా కరోడ్పతీ` తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మొత్తం 60 ఎపిసోడ్లు ఉంటాయని, ఒక్కో ఎపిసోడ్కు రూ.30 లక్షల చొప్పున ఎన్టీఆర్ మొత్తం రూ.18 కోట్లు రెమ్యునరేషన్గా అందుకోబోతున్నాడని టాక్ వస్తోంది. అలాగే మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్వయంగా నిర్మిస్తున్నాడని, రెమ్యునరేషన్ ప్రసక్తే లేదని అంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. పూర్తి వివరాలు అఫిషియల్గా రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా ఇంకా చాలా సినిమాలు ఆయన చేయాల్సి ఉంది.