ప్రముఖ హీరోయిన్ అనుష్క పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద సందడి చేశారు. గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో అనుష్క పూజలు చేశారు. అనుష్క అక్కడకు వచ్చారన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు. ఆమె సాదాసీదాగా ఉండటంఓ ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు.
అయితే ప్రముఖ హీరోయిన్లా కాకుండా సాదారణంగా స్వీటీ కనిపించారు. అనుష్కకు దైవభక్తి ఎక్కువని అందరికీ తెలుసు. అత్యంత సన్నిహితులతో కలిసి అనుష్క పోలవరం వద్ద పడవలో ప్రయాణించారు. మాస్కులు ధరించడంతో ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. అనుష్క తన సొంతూరు మంగళూరు నుంచి పురుషోత్తపట్నం వచ్చారని అంటున్నారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ ఇంత సింపుల్గా ఉన్నారని.. అదే అనుష్క స్పెషాలిటీ అని అంతా అనుకుంటున్నారు. కాగా అనుష్క కొత్త సినిమాల గురించి ప్రస్తుతం సమాచారం లేదు. ఇటీవలె ఆమె నటించిన నిశబ్దం మూవీ విడుదలై మంచి థ్రిల్లర్గా అనిపించింది.