మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కులం, మతం తేడాలు చూపిస్తూ ఎలా ప్రవర్తిస్తుంటారో అని. కానీ నిజ జీవితంలో కూడా ఇంకా దళితులు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన దేశం మొత్తం చర్చకు దారితీస్తోంది.
ఛతర్పూర్ జిల్లాలో కిషాన్పూర్ గ్రామంలో డిసెంబరు 7న ముగ్గురు యువకులు పార్టీ చేసుకున్నారు. వీరిలో దళిత యువకుడు దేవరాజ్ అనురాగీ ఉన్నాడు. అతను పార్టీ కోసం తెచ్చిన ఆహారాన్ని ముందుగా ముట్టుకున్నాడు. ఈ విషయం ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాల వారికి తెలిసింది. దీంతో వారు ముందుగా ఆ దళిత యువకుడిని బెదిరించారు. తరువాత ఆ ఇద్దరు యువకులు అ దళిత యువకుడిని కర్రతో చావబాదారు. ఫలితంగా అతను స్పృహతప్పి పడిపోయాడు. తరువాత ఆ యువకుడిని అతని ఇంటి దగ్గర వదిలేసి, ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో గాయాలపాలైన ఆ దళిత యువకుడు ప్రాణాలొదిలాడు.
ఈ ఉదంతం గురించి ఛతర్పూర్ ఎఎస్పీ సమీర్ సౌరభ్ మాట్లాడుతూ ఈ ఉదంతం డిసెంబరు 7న జరిగిందని, కిషాన్పూర్ గ్రామంలో మతిస్థిమితం లేని దళిత యువకుడు దేవరాజ్ అనురాగీని… సోనీ, పాల్లు ఆహారం తినేందుకు పిలిచారని, రెండు గంటల తరువాత ఆ యువకుడిని అతని ఇంటిలో వదలివేశారన్నారు. తనను ఆ ఇద్దరు యువకులు కొట్టారని అనురాగీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ఆహారం ముట్టుకున్నందుకు కొట్టారని అనురాగీ ఆరోపించాడన్నారు. త్వరలోనే నిందింతులను పట్టుకుంటామని తెలిపారు.