కరోనా లాక్డౌన్ నుంచి థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చన్న నిబంధనలు ఉన్నా ఇంతవరకు ఆ మేరకు ఓపెన్ కాలేదు. కాగా ఒక్క అగ్ర కథానాయకుడు సినిమా అయినా థియేటర్లలో ఓపెన్ అయితే మళ్లీ పాతరోజులు వస్తాయని అంతా అనుకుంటున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్ర వి.. ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఎంతో వెయిట్ చేశారు. అయితే లాక్డౌన్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే థియేటర్స్ ఓపెన్ అవగానే సినిమాను థియేటర్స్లో విడుదల చేసుకుంటామనే కండీషన్తోనే డిజిటల్ హక్కులను అప్పట్లో అమెజాన్కు దిల్రాజు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. రీసెంట్గా ప్రభుత్వం యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చునని చెప్పింది. ఈ క్రమంలో దిల్రాజు ‘వి’ సినిమాను థియేటర్స్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇందులో సుధీర్బాబు కూడా మరో కథానాయకుడిగా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్గా నటించారు.