ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లో వేలాది మంది ప్రజలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఎంతో మందికి సహాయం అడిగిన వెంటనే సహాయం చేసి ఆదుకున్నారు.
ప్రపంచంలో యు.కె.కి చెందిన పాపులర్ మేగజైన్ ఈస్టర్న్ఐ ఓ సర్వే నిర్వహించింది.అందులో భాగంగా టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ గ్లోబల్ 2020 లిస్ట్ను ఈస్టర్న్ ఐ తయారు చేసింది. ఈ ఏషియా సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్ జాబితాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. టెలివిజన్, సాహిత్యం మరియు సోషల్ మీడియాతో సహా హాలీవుడ్ తారలందరినీ క్రాస్ చేసి సోనూసూద్ నెంబర్ వన్ ప్లేస్లో నిలవడం విశేషం. కాగా ఈ లిస్టులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచారు.
ఈ సందర్బంగా సోనూసూద్ మాట్లాడుతూ నా ఎఫర్ట్స్ను గుర్తించినందుకు ఈస్టర్న్ ఐ పత్రికకు ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో నా బాధ్యతగా నా దేశ పౌరులకు అండగా నిలబడ్డానన్నారు. ఈ కార్యక్రమాలను నా చివరి శ్వాస వరకు ఆపనన్నారు. ప్రజలకు సహాయం చేసేందుకు సోనూసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టారన్న వార్తలు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి.