నిత్యం వివాదాలలో నడిచే కేసినేని ట్రావెల్స్ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. నష్టాలని చూపిస్తూ ఈ సంస్థ మూసేశారు కేసినేని నాని. ఈ సంస్థ కి చెందిన సగానికి పైగా బస్సులు ఇప్పటికే అమ్మేసారు కూడా. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రతీ చోటా కేసినేని ట్రావెల్స్ బోర్డు ని ఇవాళ తీసేసారు . చంద్రబాబు తో ఈ విషయం గురించి మాట్లాడిన కేసినేని నాని ముఖ్యమంత్రి కి తన నిర్ణయం చెప్పిన తరవాత నే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు.
నానితో ఈ మధ్యన చాలా సేపు ఈ విషయం లో చర్చ జరిగింది. ఈ విషయంలో పునరాలోచించాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అంతలోనే సంస్థను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆర్టీఏ అధికారి తో నానీ దురుసుగా ప్రవర్తించిన తరవాత ఇలాంటి తీవ్ర పరిణామాలు వరసగా కలగడం విశేషం. ఈగో ప్రాబ్లం కారణంగా సంస్థనే మూసేసాడు నానీ అంటున్నారు అందరూ.