కాశ్మీర్ వెళుతున్న జనసేన .. అక్కడేం పని ?

కాశ్మీర్ నిత్యం ఉద్రిక్తంగా మారుతున్న వేళలో వేర్పాటు వాదులు కిరాయి వ్యక్తులని తీసుకుని సైన్యం మీద రాళ్ళు రువ్విస్తున్నారు. వారిని తరిమి కొట్టడం కోసం సైనికులు పెల్లెట్ గన్స్ ని వాడుతున్నారు. అయినా అక్కడి యువత ఏమాత్రం తగ్గకుండా రన్ను రువ్వుతూనే ఉన్నారు. కాన్పూర్ కి చెందిన జనసేన అనే సంస్థ ఒక సైన్యాన్ని తయారు చేసింది.

ఈ సైన్యం లో ఉండే సాధువులు రాళ్ళూ రువ్వడం లో శిక్షణ తీసుకుంటున్నారు, కేవలం పురుషులే కాదు మహిళలు కూడా వీరిలో ఉండడం విశేషం. కాశ్మీర్ యువతని అడ్డుకోవడమే జనసేన తక్షణ కర్త్వవ్యం అని చెబుతున్న వీరు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు.రేపు ఈ సైన్యానికి చెందిన వేలాది మంది కశ్మీర్ కు వెళుతున్నారు. రాళ్లు రువ్వుతూ, దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న అక్కడి అల్లరిమూకలకు గట్టి గుణపాఠం నేర్పుతామని వీరు చెబుతున్నారు. మరి వీరి యత్నాలు ఎంతమేర ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here