రాష్ట్రపతి ఎన్నికల హడావిడి అప్పుడే మొదలు పెట్టేసారు మనవాళ్ళు. ఎన్డీయే , యూపీఏ రాష్ట్రపతి స్థానం లో సరైన ఏకీభావం లేకపోవడం తో ఎన్నికలే శరణ్యం అని ఫిక్స్ అయ్యారు. రెండు పక్షాలూ తమ అభ్యర్ధి ఎంపిక విషయం లో పూర్తిగా దృష్టి పెట్టాయి. ఇప్పటికే పలువురి పేర్లు రాష్ట్రపతి అభ్యర్ధి గా వినపడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేరు తెరమీదకి వచ్చింది.
సీనియర్ లీడర్ గా బీజేపీ కి ఎన్నో దశాబ్దాల నుంచీ సేవ చేస్తున్న వెంకయ్య నాయుడు ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు. గత కాలం లో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపతి ముర్ము తో పాటు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మరో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లు రేసులో ఉన్నారు .