అక్కినేని నాగచైతన్య బిజీ అయిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా గ్యాప్ రావడంతో ఇప్పుడు ఆయన మళ్లీ షూటింగ్స్లో రెగ్యులర్గా పాల్గొంటున్నారు. ఇప్పటిక్ ఓ సినిమా పూర్తి చేసిన చైతూ.. వెంటనే మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె లవ్స్టోరీ సినిమా షూటింగ్ను చైతన్య కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ఇంకా టైం పట్టనుంది. అయితే అంతలోపే ఇంకో సినిమాకు చైతూ ఓకే చెప్పేశాడు. మనం సినిమా తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కలిసి నాగ చైతన్య సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను దిల్రాజ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తోంది. ముగ్గురు హీరోయిన్లుగా ఎవరికి తీసుకోవాలన్న దానిపై ఇంకా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు థ్యాంక్యూ అనే టైటిల్ను ఇప్పటికే ఖరారు చేశారు. దసరా సందర్బంగా సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.