మ‌హేష్ బాబు భార్య పొలంలో ఏం చేస్తుంది..

సెల‌బ్రెటీలు ఏం చేసినా అంద‌రూ విచిత్రంగానే చూస్తారు. అదీ స్టార్‌లు అయితే ఇంకా ఆ పాపులారిటీ ఇంకా వేరుగా ఉంటుంది. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య‌, హీరోయిన్ న‌మ్ర‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. ఆ త‌ర్వాత మ‌హేష్ వైఫ్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ వృత్తిగత విశేషాలతోపాటు తమ కుటుంబ విషయాలను కూడా నమ్రత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చిన నమ్రత.. తాజాగా హైదరాబాద్‌లోని తమ పొలంలోకి వెళ్లారు. అక్కడి విశేషాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. టమోటా, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను చూపించారు. అలాగే కోసేసిన వరి పొలాన్ని చూపించారు. `పొలంలో పండిన వాటి కంటే తాజావి ఇంకేముంటాయి. ఐ లవ్‌ ఇట్‌` అని కామెంట్ చేశారు. ఈ వీడియోకు మహేష్ అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యుల లాగా సంపన్నులు కూడా పొలం బాట ప‌ట్ట‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here