సాదారణంగా పెళ్లిలో వరుడు, వధువు తరపు బంధువులు గొడవలు పడటం మనం చూస్తుంటాం. ఇలా ఇరువురు గొడవల కారణంగా చాలా వివాహాలు పీటల మీదనే ఆగిపోయాయి. అయితే ఇక్కడ పెళ్లికొడుకు స్నేహితులు అతనిపైనే గొడవకు దిగి చివరకు హత్య చేసి చంపే వరకు వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళితే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆలీఘడ్లో జరిగింది. పాలిముకీంపూర్ గ్రామానికి చెందిన 28 సంవత్సరాల బబ్లూ అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం అయ్యింది. అయితే తన స్నేహితుల కోసం వరుడు ప్రత్యేకంగా మందు పార్టీ ఏర్పాటు చేశాడు. కాగా ఇంకా మద్యం కావాలని అతని స్నేహితులు అడిగారు. అదే సమయానికి పెళ్లికొడుకు బబ్లూ అక్కడికి వెళ్లాడు. ఇప్పటికే చాలా మద్యం తాగారని ఇంతటితో చాలించాలని నచ్చజెప్పారు. అయితే వారు ఎంతకీ వినలేదు. వరుడికి, ఫ్రెండ్స్కి మద్య వివాదం పెరిగిపోయింది. ఈ క్రమంలో వారిలో ఒకరు వరుడు బబ్లూను కత్తితో పొడిచేశాడు.
వెంటనే అక్కడున్న మిగతా వారు అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే బబ్లూ మృతిచెందాడు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లి సంబరం ఇంకా ముగియకముందే వరుడు ఇలా చనిపోవడంతో బంధువులు, చుట్టుప్రక్కల వారంతా షాక్కు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాదారణంగా వరుడు, వధువు తరపు బంధువుల గొడవ వల్ల పెళ్లిలో పలు ఘటనలు జరుగుతాయి. కాగా సర్దుకుపోవాల్సిన స్నేహితులే ఇలాంటి ఘటనలకు పాల్పడటం అరుదుగా చూస్తుంటాం.