రాబోతున్న ఎన్నికల్లో తెరాస పార్టీ పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది అనీ తన తండ్రి కెసిఆర్ తిరుగులేని ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పాలనే ఆయన్ని మళ్ళీ కుర్చీ లో కూర్చో బడుతుంది అని కెసిఆర్ కూతురు , తెరాస ఎంపీ కవిత అన్నారు. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ” డిల్లీ నుంచి బాద్షా వచ్చినా , కాంగ్రెస్ పార్టీ నుంచి బాహుబలి వచ్చినా తెరాస విజయాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అసలు బాహుబలి నీ బాద్షా లనీ మేము కేర్ కూడా చెయ్యము . ఎందుకంటే మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.
ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల కి లోటు లేకుండా పాలిస్తున్నాం ” అన్నారు ఆమె. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేసి… ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేస్తామని అన్నారు.