ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ నారాయణ కొడుకు నిషిత్ కారు ప్రమాదం లో మృతి చెందిన తరవాత జూబ్లీ హిల్స్ రోడ్డు 36 ని బెంజ్ సంస్థ పరిశీలన చేసింది. కారు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆసంస్థ ఉన్నత అధికారులు వెంటనే ఆ ప్రాంతం చూడడం కోసం వచ్చారు. అన్ని రకాల రక్షణ వ్యవస్థలున్న కారు అంతలా ఎలా దెబ్బతిందన్న విషయాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల క్రితమే జర్మనీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచీ జూబ్లీ చెక్ పోస్టు దగ్గర తొమ్మిదవ నెంబర్ పిల్లర్ వద్దకి వచ్చిన బెంజ్ అధికారులు, అక్కడి టర్నింగ్ నీ సీసీ టీవీ కెమెరా లోని ఫూటేజ్ నీ చూసారు.
బోయిన్ పల్లిలోని బెంజ్ షోరూంలో ఉన్న నిషిత్ కారును కూడా వారు పరిశీలించారు. హైదరాబాద్ పోలీసుల సూచన మేరకు, ప్రమాదంపై వీరు కంపెనీ తరఫున వివరణ ఇవ్వనున్నారు.