సీఎం జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపించిన విజయసాయి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. ఏడాది లో ఎవరూ ఊహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి 41718 కోట్ల రూపాయల ను అందించిన విషయాన్ని, 90 శాతం హామీలు అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఏడాది పాలన పై ప్రజల వద్దకు మేనిఫెస్టో, ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో ను మాయం చేసిన బాబెక్కడ, ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారు ఎక్కడ అని పోల్చి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here