కడప ఎంపీ అవినాష్ రెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ అని తేలింది. సెప్టెంబర్ మొదటి వారం లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోసం ముందుగానే అధికారులకి నేతలకి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షల లోనే అవినాష్ రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. విషయం తెలిసిన అనంతరం అవినాష్ రెడ్డి హోమ్ ఐసొలేషన్ కి వెళ్లిపోయారు. అయితే అవినాష్ రెడ్డి కి రావడంతో అతనితో ఉన్న అనుచరులు సైతం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. రోజుకి పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తో రాష్ట్రం లో భయాందోళన నెలకొంది.