టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. అయితే ట్విట్టర్ ద్వారా చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25 న “వెన్నుపోటు” దినోత్సవం జరుపుకున్నాడని అన్నారు.
అంతేకాదు ఆగస్ట్ 28 వ తేదిన చంద్రన్న రక్తపాత దినోత్సవం జరుపుకుంటున్నారని, హైదరాబాద్లోని బషీర్బాగ్లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు అంటూ మండిపడ్డారు.
విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్బాగ్లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2020